విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఏపీ ఎడ్సెట్ 2021 ప్రవేశ పరీక్ష యొక్క ఫలితాలను ఇవాళ అంటే మంగళవారం విడుదల చేశారు. ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు ఇవాళ ఈ ఫలితాలను విశాఖపట్నం నుండి విడుదల చేశారు.
ఈ సంవత్సరం ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షకు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,619 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. కాగా ఈ పరీక్ష రాసిన 13169 మందిలో ఏకంగా 13,428 మంది అంటే, 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని కన్వీనర్ విశ్వేశ్వర్రావు వెల్లడించారు.
కాగా గత సంవత్సరం ఉన్న డాటా ప్రకారం రాష్ట్రం మొత్తం మీద 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా ఎడ్ సెట్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తెలిపింది.