fbpx
Saturday, July 27, 2024
HomeNationalఏపీకి మూడు స్వఛ్ఛ భారత్ అవార్డులు

ఏపీకి మూడు స్వఛ్ఛ భారత్ అవార్డులు

AP-WON-3-SWACCH-BHARAT-AWARDS

విజయవాడ : ప్రతి ఏడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రకటించే స్వఛ్ఛత అవార్డులు ప్రకటించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అవార్డుల పంట పండింది. తాజాగా కేంద్రం శుక్రవారం స్వచ్చ భారత్‌ దివస్‌కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది.

ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌‌లో రాష్ట్రానికి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో స్వచ్ఛ సుందర్‌ సముదాయక్‌ శౌచాలయ కేటగిరీలో రెండో ర్యాంకు, సముదాయక్‌ శౌచాలయ అభియాన్‌ కేటగిరీలో మూడవ ర్యాంక్‌, దీంతో పాటు గంధగి ముక్త్‌ భారత్‌ కేటగిరీలో మూడవ ర్యాంక్‌ లభించింది.

జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డులు రావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి సత్ఫలితాలనిచ్చింది. కాగా గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఇన్ని ర్యాంకులు దక్కలేదు. సచివాలయ వ్యవస్థతోనే జాతీయ ర్యాంకులు సాధ్యమైన వేళ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది.

అయితే 2014 సంవత్సరం నుంచి ప్రతిఏటా అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్‌ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలను స్వచ్ఛ భారత్‌ దివస్‌ కింద ర్యాంకులను ప్రకటిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular