fbpx
Saturday, July 27, 2024
HomeAndhra Pradeshఏపీకి విద్యుత్‌ సంస్కరణలలో రెండో స్థానం

ఏపీకి విద్యుత్‌ సంస్కరణలలో రెండో స్థానం

AP-SECOND-IN-ELECTRICAL-REFORMS-IMPLEMENTATION

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మూడు విద్యుత్‌ సంస్కరణలను అమలు చేయడంలొ, మధ్యప్రదేశ్‌ తర్వాత విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ రెండో ర్యాంక్ లో నిలిచింది. దానివల్ల జీఎస్‌డీపీలో 0.15 శాతం వరకు, అంటే రూ.1,515 కోట్ల మేర అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించింది.

కరోనా‌ వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా జీఎస్‌డీపీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునేందుకు పరిమితిని పెంచింది. అయితే ఇందులో 1 శాతానికి షరతులు విధించింది. పౌర కేంద్రీకృత సంస్కరణలు అమలు చేస్తే ఈ 1 శాతం రుణ పరిమితినీ వాడుకోవచ్చని పేర్కొంది.

రేషన్‌ కార్డు దేశంలో ఎక్కడైనా వినియోగించుకునేలా వ్యవస్థను రూపొందించడం, సులభతర వాణిజ్య సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు, విద్యుత్‌ సంస్కరణల్లో ఒక్కో సంస్కరణ అమలు చేస్తే జీఎస్‌డీపీలో 0.25 శాతం మేర అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు వీలు కలుగుతుంది.

రాష్ట్రం‌ ఇప్పటికే మూడు సంస్కరణలు అమలు చేసి తాజాగా విద్యుత్‌ సంస్కరణల అమలును కూడా పూర్తి చేసింది. విద్యుత్‌ సంస్కరణలు మూడింటిలో ఒకటైన విద్యుత్‌ సబ్సిడీల ప్రత్యక్ష నగదు బదిలీని 2020 డిసెంబర్‌ 31లోపు ఒక్క జిల్లాలోనైనా పూర్తి చేస్తే జీఎస్‌డీపీలో 0.15 శాతం మేర అదనపు రుణాలకు అర్హత లభిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ సంస్కరణను అమలు చేసింది. 2020 సెప్టెంబర్‌ నుంచి విద్యుత్‌ రాయితీలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్‌ 1 కల్లా అన్ని జిల్లాల్లో ఇలాగే అమలు చేయనుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ అమలు చేసిన సంస్కరణల కారణంగా రూ.9,190 కోట్ల మేర అదనపు రుణాలకు అర్హత లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular