fbpx
HomeInternationalఅమెరికా కవయిత్రి లూయిస్ గ్లుక్ కు నోబెల్

అమెరికా కవయిత్రి లూయిస్ గ్లుక్ కు నోబెల్

LOUIS-GLUCK-WINS-NOBEL-IN-LITERATURE

స్టాక్‌హోమ్‌: సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్‌(77)ను వరించింది. ‘ఎటువంటి దాపరికాలు, రాజీలేని గ్లుక్‌ తన కవితల్లో, కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’, అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని నోబెల్‌ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది.

హృద్యమైన, స్పష్టమైన ఆమె కవితా స్వరం వ్యక్తి ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తుంది అని స్వీడిష్‌ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్‌ మామ్‌ పేర్కొన్నారు. 2006లో గ్లుక్‌ రచించిన ‘అవెర్నో’ కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్‌ సాహిత్య కమిటీ చైర్మన్‌ ఆండెర్స్‌ ఒల్సన్‌ పేర్కొన్నారు.

కాగా, గ్లుక్‌తో కలిపి ఇప్పటి వరకు 16 మంది మహిళలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. స్వీడిష్‌ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్‌ క్రోనార్లు) తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. చివరిసారిగా సాహిత్యంలో నోబెల్‌ గెలుచుకున్న అమెరికన్‌ బాబ్‌ డైలాన్‌(2016). హంగేరియన్‌–యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్‌ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు.

సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్‌ రచయితకు స్వీడిష్‌ అకాడమీ ప్రకటిస్తుందని చాలా మంది భావించినా అమెరికన్‌కే ప్రకటించింది. సాహిత్యంలో నోబెల్‌ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. నోబెల్‌ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular