fbpx
HomeAndhra Pradeshనూతన టీటీడీ ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డి

నూతన టీటీడీ ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డి

TTD-EO-KS-JAWAHAR-REDDY

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్‌ జవహర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా శనివారం బాధ్యతలు స్వీకరించ బోతున్నారు. ఈ సందర్భంగా కేఎస్ జవహర్ రెడ్డి తాడేపల్లిలోని టీటీడీ చైర్మన్‌ కార్యాలయంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పలు అంశాల గురించి వారు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇన్నాళ్లుకు నాకు శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం దక్కింది. వైద్యారోగ్య శాఖలో నూతనంగా ప్రవేశ పెడుతున్న నాడు-నేడు కార్యక్రమం దేశంలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ఈ మహత్తర కార్టక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది’ అని అన్నారు.

ప్రస్తుతం ఆయన వైద్య ఆర్గొయ శాఖ ముఖ్య కార్యదర్శి గా పని చేస్తున్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో ఆయన ఎంతో కీలకంగా పని చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular