fbpx
HomeAndhra Pradeshఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

AP-CORONA-CASES-DECLINED

అమరావతి : ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రోజూ రికార్డు‌ స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 61 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 56,145 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,256 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్క రోజు 38 మంది మృత్యువాత పడ్డారు.

ఈ రోజు వరకు మొత్తం కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. మరణాల సంఖ్య 6,019గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం 51,060 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆదివారం నాడు 7,558 మంది కోలుకోగా మొత్తం 6,66,433 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 61,50,351 కరోనా పరీక్షలు పూర్తి చేశారు.

జిల్లాల వారిగా కేసులు ఇలా ఉన్నాయి: అనంతపురం: 271, చిత్తూరు: 224, తూర్పు గోదావరి: 853, గుంటూరు: 444, కడప: 231, క్రిష్ణ: 179, కర్నూల్: 86, నెల్లూరు: 365, ప్రకాశం: 666, శ్రీకాకుళం: 157, విశాఖపట్టణం: 138, విజయనగరం: 129, పశ్చిమ గోదావరి: 513. మొత్తం కేసులు: 4256. గత కొన్ని రోజులతో పోలిస్తే పాజిటివ్ కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular