fbpx
HomeBusinessక్రిప్టో పై టాక్స్‌ మినహాయింపు అంచనాలతో సెన్సెక్స్‌ జంప్‌!

క్రిప్టో పై టాక్స్‌ మినహాయింపు అంచనాలతో సెన్సెక్స్‌ జంప్‌!

CRYPTO-TAXATION-BOOSTS-SENSEX-MARKET-AFTER-TWODAYS-LOSSES

ముంబై: భారత స్టాక్‌మార్కెట్లు నష్టాలనుంచి కోలుకుని ఇవాళ భారీ లాభాలతో ముగిసాయి. వరుసగా మూడవ రోజు ట్రేడింగ్‌ ఆరంభంలో లాభనష్టాల మధ్య ఊగిసలాడి మిడ్‌ సెషన్‌ నుంచి షేర్లు బాగా కోలుకున్నాయి. కొనుగోళ్లు పుంజుకోవడంతో సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్‌437 పాయింట్ల లాభంతో 55818 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు ఎగిసి 16628 వద్ద స్థిరపడ్డాయి.

అందుకు ఊతం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించే ఆసుపత్రులు, బ్యాంకు డిజిటల్ కార్డ్‌లపై రివార్డ్ పాయింట్లు, ఫ్లైట్ మైల్స్‌కు కేంద్రం క్రిప్టో టాక్స్‌ నుంచి 30 శాతం ఉప శమనం ఇవ్వనుందని సమాచారం. ఈ రిలాక్సేషన్‌పై ఆర్థికమంత్రిత్వ శాఖ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నోటిఫికేషన్‌ జారీ చేయనుందన్న అంచనాల నేపథ్యంలో మార్కెట్లకు ఊపొచ్చినట్లయింది.

దీనితో పాటుగా ఐటీ, ప్రభుత్వ బ్యాంకులు సహా దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ బయ్యింగ్‌ సపోర్ట్‌ కనిపించింది. కాగా మరో వైపు ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు బాగా రీబౌండ్‌ అయ్యాయి. రిలయన్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాన్‌ ఫిన్‌ సర్వ్‌, ఇన్ఫోసిస్‌, టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular