fbpx
HomeTelanganaరాత్రికి రాత్రే ఊళ్ళు ఖాళీ చేయించిన అధికారులు!

రాత్రికి రాత్రే ఊళ్ళు ఖాళీ చేయించిన అధికారులు!

OFFICIALS-VACATED-75-FAMILIES-IN-SIDDIPET-DISTRICT

తొగుట: కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కింద ముంపు గ్రామం రాంపురం మదిర వడ్డెర కాలనీ వాసులను అక్కడి అధికారులు సోమవారం రాత్రికి రాత్రే అందరినీ ఖాళీ చేయించారు. కాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కాలనీలో దాదాపు 75 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారు.

అక్కడ ఉన్న కుటుంబాల్లో మెజార్టీ కుటుంబాలు ఈ గ్రామం నుంచి ఈ పాటికే వెళ్లిపోగా ఈ సోమవారం రాత్రి 30 డీసీఎంలు వేసుకుని తహసీల్దార్‌ బాల్‌రెడ్డి మరియు ఆర్‌ఐ రవీందర్‌ కాలనీకి వచ్చారు. అయితే తమకు ఎటువంటి నష్టపరిహారం పూర్తిగా చెల్లించకుండా ఎలా ఖాళీ చేయిస్తారంటూ నిర్వాసితులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.

కాగా తాము అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలని మహిళలు మరియు పురుషులు బోరున విలపించారు. కాగా అర్హులైన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లింస్తుందంటూ అధికారులు అక్కడి వారందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ రిజర్వాయర్‌లోకి నీరు వదిలడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు వారికి వివరించారు. మొత్తనికి అక్కడ ఉన్న వడ్డెర కాలనీలోని సుమారు 30 కుటుంబాలను అధికారులు విజయవంతంగా ఖాళీ చేయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular