fbpx
HomeAndhra Pradeshనేటి ఏపీ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు!

నేటి ఏపీ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు!

AP-CABINET-CRUCIAL-DECISIONS-TAKEN-TODAY

అమరావతి: ఏపీ‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో జులై 8వ తేదీన వైఎస్‌ఆర్‌ రైతు దినోత్సవం జరపాలని నిర్ణయించింది. అలాగే 100 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ల ప్రారంభించడానికి కూడా ఆమోదం తెలిపింది. 640 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో 45 కొత్త రైతు బజార్ల ఏర్పాటు, ఆర్‌బీకేల వద్ద గోడౌన్ల నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే విధంగా, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమాచార శాఖ మంత్రి పేర్ని కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

రాష్ట్రంలో రూ.89 కోట్లతో మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు, వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి కేబినెట్‌ ఆమోదం, జులై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణాలకు శంకుస్థాపన మహోత్సవం, ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 80వేల ఆర్థికసాయం.

అలాగే అమ్మఒడి పథకంలో నగదు వద్దు అనుకుంటే ల్యాప్‌టాప్‌ పంపిణీకి ఆమోదం (ఇప్పటికే 35శాతం తల్లులు ల్యాప్‌టాప్‌లు కావాలని ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో.. మూడేళ్ల వారంటీతో ల్యాప్‌టాప్‌లు పంపిణీ), రూ.339 కోట్లతో ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్శిటీ ఏర్పాటుకు ఆమోదం, విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను వర్శిటీగా మార్పు.

మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు నిర్ణయం, నగరాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న స్థలాలు సేకరించి లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి ప్రజలకు కేటాయించాలని నిర్ణయం. వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని నిర్ణయం. కాకినాడ సెజ్‌లో 2,180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయం, పీహెచ్‌సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular