fbpx
HomeNationalకీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్‌

కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్‌

3-INDUSTRIAL-CORRIDORS-ANNOUNCED-BY-UNION-CABINET

ఢిల్లీ : బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో కొత్తగా మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ ఎగుమతికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణపట్నం, కర్ణాటక లోని తుముకూరులో పారిశ్రామిక కారిడార్‌లతో పాటు గ్రేటర్ నోయిడాలోని మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ & మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ లకు కేంద్రం​ అనుమతి తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ, మూడు పారిశ్రామిక కారిడార్లకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ. 7,725 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ మూడు పారిశ్రామిక కారిడార్లను నిర్మించడం ద్వారా మొత్తం 2.8 లక్షల మందికి ఉపాది లభించనున్నట్లు అంచనా వేసినట్లుగా పేర్కొన్నారు. కాగా కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం రూ.2,139 కోట్లుగా ఉందని తెలిపారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని తెలిపారు.

ఏపీలోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ వల్ల లాజిస్టిక్ ఖర్చు తగ్గింపుతో పాటు, నిర్వహణ సామర్థ్యం కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వీటితో పాటు భారత్‌, భూటాన్‌ దేశాల మధ్య శాంతి భద్రతలకు సంబంధించి ఎంవోయూకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular