fbpx
HomeTelanganaతెలంగాణలో కరెంట్ 250 యూనిట్ల వరకు ఫ్రీ! ఎవరికి?

తెలంగాణలో కరెంట్ 250 యూనిట్ల వరకు ఫ్రీ! ఎవరికి?

250UNITS-ELECTRICITY-FREE-TELANGANA-BARBERS-LAUNDRY-SHOPS

హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో హెయిర్‌ కటింగ్‌ షాపులు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఒక్కో నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక సంఘాలు మరియు నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట ఆయన ఈ నిర్ణయాన్ని తెలియజేశారు.

దీనికి సంబంధించిన జీవో కూడా తక్షణమే జారీ చేయాల్సిందిగా సీఎంవో కార్యదర్శి భూపాల్‌ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఆదివారం జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్‌ సరఫరా ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వస్తుంది.

తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతేనని , వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయినుంచి జీహెచ్‌ఎంసీ వరకు ఉన్న అన్ని కటింగు షాపులు, లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు.

కులవృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular