fbpx
HomeAndhra Pradeshతన బిడ్డ షర్మిలను ఆశీర్వదించమని కోరిన వైఎస్‌ విజయమ్మ

తన బిడ్డ షర్మిలను ఆశీర్వదించమని కోరిన వైఎస్‌ విజయమ్మ

VIJAYAMMA-ASKS-BLESSINGS-TO-SHARMILA-FROM-TELANGANA-PEOPLE

ఖమ్మం: ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బాటలోనే ఖమ్మం నుంచి ప్రజలతో కలిసి నడిచేందుకు తమ కూతురు షర్మిల వచ్చిందని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఈ సందర్భంగా షర్మిలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలతో తమకున్న అనుబంధం మరువలేదని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ని నాయకుడిగా నిలబెట్టిన ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంది అని పేర్కొన్నారు. వైఎస్సార్‌ లేరన్న వార్తతో అనేక గుండెలు ఆగిపోయాయని గుర్తుచేశారు. ఖమ్మం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సంకల్ప సభలో వైఎస్‌ విజయమ్మ పాల్గొని మాట్లాడారు.

వైఎస్సార్‌ ప్రతి సాధారణ మనిషిని కూడా అభిమానంగానే ప్రేమించారు. కుల, మత, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసేవారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌‌ సంక్షేమ ఫలాలు అందించారు. కోటి ఎకరాలకు నీరందించేందుకు జలయజ్ఞం ప్రారంభించిన గొప్ప నాయకుడు వైఎస్సార్‌.

రాజశేఖర్ రెడ్డి గారి‌‌ పాలన ఒక స్వర్ణయుగం. కరెంటు బిల్లు అయినా, ఆర్టీసీ ఛార్జీలైనా ఎప్పుడూ ఏవీ పెంచలేదు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా లక్షల మంది ఆరోగ్యానికి సహాయం చేశారు. ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే అయినా వైఎస్‌ఆర్‌ చలవే. నా బిడ్డ షర్మిలను మీ చేతుల్లో పెడుతున్నా, ఆశీర్వదించండి అని వైఎస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular