fbpx
HomeAndhra Pradeshటాలీవుడ్ మీట్: షాక్ ఇచ్చిన సిఎం జగన్

టాలీవుడ్ మీట్: షాక్ ఇచ్చిన సిఎం జగన్

అమరావతి: ఎపి సిఎం జగన్ టాలీవుడ్ పెద్దలకు షాక్ ఇచ్చారు. కఠినమైన కోవిడ్-19 నిబంధనల కారణంగా తనను సందర్శించే 25 మంది సభ్యుల బృందానికి ససేమీరా నో చెప్పారు. సామజిక దూరం పాటిస్తూ, మొదట జగన్‌ను 25 మంది బృందంతో కలవాలని అనుకున్న టాలీవుడ్ పెద్దల ప్రతిపాదనను సిఎం జగన్ సున్నితంగా తిరస్కరించారు.

వాస్తవానికి, 25 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కోరటాల శివ, ప్రసన్న కుమార్ తదితరులతో పాటు చిరంజీవి, నాగార్జున, రాజమౌలి, సురేష్ బాబు, సునీల్ నారంగ్ ఉన్నారు. ఏ.పి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ధృవీకరణ పొందిన తరువాత, టాలీవుడ్ పెద్దలు అనేక పేర్లను తగ్గించి పరిస్థితిని సున్నితంగా వారికి తెలియచేసారు. సి.ఎం.ఓ 3 నుండి 5 మంది సభ్యులను మాత్రమే కోరినట్లు సమాచారం. కాని అనేక అభ్యర్ధనల తరువాత, సి.ఎం.ఓ 8 మంది సభ్యుల తుది బృందానికి అనుమతి కల్పించడానికి అంగీకరించిందని చెప్పారు.

దీనితో తుదిగా చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, రాజమౌలి, దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, సునీల్ నారంగ్, సి కళ్యాణ్ మిగిలారు. ఈ సమావేశం నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అమరావతిలో సిఎం క్యాంప్ కార్యాలయంలో జరగింది. ఏ.పి లో ఫిల్మ్ షూటింగ్ కోసం ఫీజులను ఇటీవల విరమించుకున్నందుకు ఏ.పి సి.ఎం. జగన్ కు కృతజ్ఞతలు చెప్పడం సమావేశం యొక్క లక్ష్యం. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమను ఎలా అభివృద్ధి చేయాలో మరియు ఎ.పి. రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిశ్రమకు ఏమి అవసరమో చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular