fbpx
HomeSportsఆస్ట్రేలియాతో సిరీస్ భారతే గెలవాలి: అక్తర్

ఆస్ట్రేలియాతో సిరీస్ భారతే గెలవాలి: అక్తర్

SHOAIB-WISHES-INDIA-WIN-AUSTRALIA-SERIES

ఇస్లామాబాద్‌: ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్యా రహానేపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న అతడిని క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ సహా రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి తదితరులు ఇటీవల కొనియాడారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా ఆజింక్య రహానే కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు. ఏమాత్రం హడావుడి లేకుండా నిశ్శబ్దంగా ఉంటూనే అద్భుతం చేసి చూపించాడని కితాబిచ్చాడు. ఘోర పరాభవం ఎదురైన చోటే టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

ఈ మేరకు పాకిస్తాన్ మాజీ పేసర్‌ అక్తర్‌ స్పోర్ట్స్‌ చానెల్‌తో మాట్లాడుతూ, ఒకరోజు ఉదయం స్కోరు చూసే సరికి 36 పరుగులకే 9 వికెట్లు టీమిండియా స్కోరు. కానీ ఆ తర్వాత అంతా మారిపోయింది. రెండో టెస్టులో భారత జట్టు చూపించిన పట్టుదల అమోఘం. అజింక్య రహానే చాలా సైలెంట్‌గా కనిపిస్తాడు. మైదానంలో హడావుడి చేయడం, అతిగా ప్రవర్తించడం వంటివి ఉండవు. కూల్‌ కెప్టెన్సీతో తనకు రావాల్సిన ఫలితాన్ని రాబట్టుకున్నాడు. అతడి నాయకత్వంలో ఆటగాళ్లంతా ఒక్కసారిగా విజృంభించారు.

స్టార్‌ ఆటగాళ్ల గైర్హాజరీలో కూడా టీమిండియా ఇలా నిలదొక్కుకుందంటే అది కేవలం ఆటగాళ్ల ప్రతిభ మాత్రమే కాదు.. బెంచ్‌ అందించిన బలం అది. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని జట్టు సమిష్టిగా సత్తా చాటింది. భారీ ఓటమి తర్వాత అంత ఘనంగా పునరాగమనం చాటడం టీమిండియా పట్టుదలకు నిదర్శనం’’ అని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular