అహ్మదాబాద్: 16వ తేదీన భారత్ మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ లో తదుపరి మూడో టి20 మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికి ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్న పరిస్థితిలో మూడవ మ్యాచ్లో గెలిచే జట్టు సిరీస్లో ముందంజ వేస్తుంది. మొదటి మ్యాచ్ ఓటమి చవి చూసి రెండో మ్యాచ్లో విజయం తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిన కోహ్లి సేన అన్ని రంగాల్లో రాణించి ప్రత్యర్థిని మళ్లీ ఈడించాలని భావిస్తోంది.
కాగా గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా రిజవ్ బలాన్ని పెంచి చూపించింది. అలాగే భారత్ కు ప్రత్యామ్నాయ ఓపెనర్గా కిషన్ రూపంలో మన జట్టుకు సానుకూళాంశం కూడా లభించింది. ఈ యువ ఆటగాడు మళ్లీ ఒక మెరుపు ప్రదర్శన ఇవ్వాలని అటు అభిమానులు మరియు జట్టు కోరుకుంటోంది.
కాగా మొదటి రెండు మ్యాచ్లకు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు సిరీస్ ఆరంభంలోనే కెప్టెన్ కోహ్లి తెలిపాడు. ఒక వేళ అది నిజమైతే ఈ మూడవ మ్యాచ్లో అతను రాహుల్ స్థాన్లంలో బరిలోకి దిగాలి. వరుసగా రెండు మ్యాచ్లలో 1, 0 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ స్థానంలో మాత్రమే రోహిత్ వచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.
కానీ గడచిన రెండు సంవత్సరాలలొ భారత్ తరఫున టి20ల్లో అత్యంత నిలకడైన బ్యాట్స్మన్గా ఉన్న రాహుల్కు మరో అవకాశం ఇవ్వకుండా అప్పుడే పక్కన పెడతారా అనేది ఆలోచించాల్సిన విషయం. కోహ్లి తనదైన శైలిలో ఫామ్లోకి తిరిగి రావడం భారత జట్టుకు శుభపరిణామం.
ఇంకా మిగతా ఆటగాళ్ళు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లు కూడా చెలరేగితే జట్టు భారీ స్కోరును నిర్దేశించవచ్చు. రంగప్రవేశం చేసిన తొలి మ్యాచ్లో బ్యాటింగ్ అవకాశం దక్కని సూర్య కుమార్ యాదవ్కు ఆరో స్థానంలో ఈసారి ఎన్ని బంతులు లభిస్తాయో అన్నది వేచి చూడాలి. బ్యాటింగ్ ఇలా ఉండగా టీమిండియా బౌలింగ్లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.
ఎందుకంటే భారత అనుభవం కలిగిన స్పిన్నర్లు చహల్, సుందర్ ప్రత్యర్థిని బాగా కట్టడి చేయగలరు. ఇప్పటికే శార్దుల్ తన బౌలింగ్తో ఆకట్టుకోగా, హార్దిక్ పూర్తి కోటా బౌలింగ్ చేయగలిగాడు. పునరాగమనంలో భువనేశ్వర్ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు కాబట్టి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పరుగులు సాధించడం సులువు కాదు.
ఎర్ర మట్టితో రూపొందించిన పిచ్పై ఈ మ్యాచ్ జరగనుంది. కాబట్టి బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇరు జట్ల స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఛేదనలో సులువుగా కనిపిస్తుండటంతో టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. వర్ష సూచన అయితే ప్రస్తుతానికి లేదు.