fbpx
HomeBig Storyదేశంలో సెంచరీ దాటేసిన పెట్రోల్ ధరలు

దేశంలో సెంచరీ దాటేసిన పెట్రోల్ ధరలు

PETROL-PRICES-HIT-CENTURY-IN-COUNTRY

న్యూఢిల్లీ: దేశంలో వాహన వినియోగదారులకు ఇంధన ధరలు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు రికార్డులను తిరగరాస్తూ వెళ్తున్న లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో 38 పైసల పెంపుతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు 101.80 రూపాయలకు చేరుకుంది.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒక లీటరు పెట్రోలు ధర రూ .93.86, డీజిల్ ధర 85.94 లు పలుకుతోంది. అయితే రాజస్థాన్ అంతటా, పెట్రోల్ 93 రూపాయలకు ఎగువన, డీజిల్ ధర రూ.85 కంటే ఎక్కువగానే ఉండటం విశేషం.

ఈ రోజు నాటికి ఢిల్లీలో సాధారణ పెట్రోల్‌ రేటు రూ. 86.30, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 76.48 ఉన్నాయి. చెన్నై లో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.82, డీజిల్‌ ధర రూ. 81. 71, జైపూర్‌ లో ఇక పెట్రోలు ధర లీటరుకు రూ. 93.86, డీజిల్‌ ధర రూ. 85.94 గా ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 89.77, డీజిల్‌ ధర రూ. 83.46, ఆంధ్రప్రదేశ్ అమరావతి లో పెట్రోలు ధర లీటరుకు రూ. 92.54. డీజిల్‌ ధర రూ. 85.73 ఉన్నాయి.

వ్యాట్‌లో తేడాలు కారణంగా ఒక్కో రాష్ట్రంలో పెట్రో ధరలు ఒక్కో రకంగా ఉంటాయి. 2020 మేలో రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ధరలపై వ్యాట్ 28 శాతం ఉండగా, పెట్రోల్‌పై వ్యాట్ 38 శాతంగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌పై 20 శాతం నుంచి 33 శాతం, డీజిల్‌పై 16 శాతం నుంచి 23 శాతం వ్యాట్‌ అమల్లో ఉండగా, రాజస్థాన్‌లో ఇతర రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ 4- 8 నుంచి 10 -11 రూపాయలు ఎక్కువ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular