fbpx
Thursday, April 25, 2024
HomeTelanganaముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్!

ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్!

KCR-CLARIFIES-EARLY-ELECTIONS-IN-TELANGANA

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జరుగుతున్న ప్రచారంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇవాళ‌ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు ఏ మాత్రం లేదు అని తేల్చిచెప్పేశారు.

తమకు అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సుస్థిర ప్రభుత్వం ఉందని, సోషల్‌మీడియాలో ప్రచారం అయ్యే తలాతోకా లేని ప్రచారాన్ని నమ్మవద్దు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన సీఎం కేసీఆర్, ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి ఎటువంటి కేటాయింపులు లేకపోవడంపై ఆయన తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి తనకు తాను ఆత్మ వంచన చేసుకుని దేశ ప్రజలను ఘోరంగా వంచించారని విమర్శలు గుప్పించారు. దళితులు మరియు గిరిజన సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్త శుద్ధి లేదని ఆయన దుయ్యబట్టారు.

బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు ఊసే లేదు అని అన్నారు. యూరియా సబ్సిడీ, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత పెట్టారని మండిపడ్డారు. తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ప్రధాని మోదీ మోసం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular