fbpx
Friday, April 26, 2024
HomeTelanganaతెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియంకి కరోనా పాజిటివ్

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియంకి కరోనా పాజిటివ్

kadiyam-srihari-ex-deputy-cm

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. మొత్తం రాష్ట్రంలో ఇప్పటికి దాదాపు కేసులు దాదాపు 50 వేలకు చేరబోతున్నాయి. ప్రతిరోజు రమారమి 1,500 వరకు కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులు సైతం ఈ కరొనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ లో పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు కరోనా సోకింది.

తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణలో కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆయన గత కొన్ని రోజులు గా బయట తిరగలేదని సమాచారం. నిన్నటి వరకు ఆయన హోం ఐసొలేషన్ లోనే ఉన్నారు.

నిన్న సాయంత్రం ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందనున్నట్టు సమాచారం. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఆయన భార్య, కుమారుడు, పని మనిషికి కూడా కరోనా సోకింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular