fbpx
Saturday, July 27, 2024
HomeAndhra Pradeshఅంతర్వేది కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం

అంతర్వేది కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం

JAGANMOHAN-STARTS-NEW-CHARIOT-IN-ANTARVEDI

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ లో పవిత్ర పుణ్యక్షేత్రమైన అంతర్వేది లో నూతన రథాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయన, అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు వచ్చారు.

ముఖ్యమంత్రి జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారిని దర్శించుకున్న తరువాత సీఎం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తరువాత కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి, భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు.

ఈ నూతన రథం 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకుంది, కొత్త హంగులు మరియు రక్షణ ఏర్పాట్లతో నిర్మాణాన్ని చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డు స్థాయిలో 3 నెలల కాలంలోనే ఈ నూతన రథాన్ని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular