న్యూఢిల్లీ: భారత దేశం విదేశీ మారక నిల్వలో రష్యాను అధిగమించి ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద విదేశీ మారక నిల్వల కలిగిన దేశంగా అవతరించింది. దక్షిణాసియా దేశాల సెంట్రల్ బ్యాంక్ పెట్టుబడుల ఉపసంహరణ చర్యలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి డాలర్లను నిల్వ చేయడంతో భారత్ విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి.
పైగా ఈ సంవత్సరం వేగంగా పెరిగిన పెట్టుబడుల తరువాత, రష్యా మరియు భారత దేశాల మారక నిల్వలు దాదాపుగా సమానమయ్యాయి. అలాగే ఇటీవల గడచిన వారాల్లో రష్యా కంపెనీల్లో పెట్టుబడులు వేగంగా తగ్గడంతో మారక నిల్వల్లో భారత్ పైకు వచ్చింది. దీని ఫలితంగా ఇప్పుడు ప్రపంచం విదేశీ మారక నిల్వల్లో భారత్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇదిలా ఉండగా మార్చి 5 నాటికి భారతదేశ విదేశీ కరెన్సీ హోల్డింగ్స్ 4.3 బిలియన్ డాలర్లు తగ్గి 580.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. అదే సమయంలో రష్యా తన దగ్గర 580.1 బిలియన్ డాలర్ల మారక నిల్వలు కలిగి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం విదేశీ మారక నిల్వల్లో మొదటి స్థానంలో చైనా ఉండగా, తరువాతి స్థానాల్లో వరుసగా జపాన్ మరియు స్విట్జర్లాండ్ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ దగ్గర సుమారు 18 నెలల దిగుమతులను చేయడానికి సరిపోయే విదేశీ నిల్వలున్నాయి.
ఈ తాజా డేటాను విడుదల చేయడానికి ముందే డ్యూయిష్ బ్యాంక్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లలో భారత్లో వివిధ రకాల నిల్వలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. ఫారెన్ ఎక్సేఛేంజ్ నిల్వలు గణనీయంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థకు ఏదైనా బాహ్య షాక్-ఆధారిత మూలధన-స్టాప్, రాబోయే కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సులువుగా ఆర్బీఐ డీల్ చేయగలదని తెలిపారు.