fbpx
HomeInternational3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే టీమిండియా ఆలౌట్!

3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే టీమిండియా ఆలౌట్!

INDIA-ALLOUT-FOR-78RUNS-IN-FIRST-INNINGS-OF-3RDTEST

హెడింగ్లీ: లార్ద్స్ టెస్ట్ లో విజయం సాధించి ఎంతో ఆత్మ విశ్వాసంతో 3వ టెస్ట్ లో అడుగుపెట్టింది టీమిండియా. అయితే ఆ విశ్వాసం 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ సేపు నిలబడలేదు. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. కాగా ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్ మెన్ లైనప్ ఒక్క సారిగా కుప్పకూలింది.

కేవలం 40.4 ఓవర్లు మాత్రమే ఆడి టిమిండియా అలౌట్ అయింది. జట్టులో రెండంకెల స్కోరు చేసిన ఆటగాళ్ళు కేవలం ఇద్దరు మాత్రమే అంటే ఇన్నింగ్స్ ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ శర్మ 19, ఆజింక్య రహానే 18 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ముగ్గురు బ్యాట్స్ మెన్ డకౌట్ గా పెవిలియన్ చేరారు.

డకౌట్ అయిన ఆటగాళ్ళలో ఓపెనర్ కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమీ మరియు జస్ప్రీత్ బూమ్రా ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కేవలం 7 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో విరాట్ 50 ఇన్నింగ్స్ లో ఒక సెంచరి కూడా నమోదు చేయని చెత్త రికార్డును నమోదు చేశాడు.

ఇంగ్లండ్ బౌలర్లు భారత్ బ్యాటింగ్ లైనప్ ను మొదటి నుండే దెబ్బ తీయడం ప్రారంభించారు. జేంస్ ఆండర్సన్ 3 వికెట్లు, రాబిన్సన్ 2 వికెట్లు, సాం కుర్రన్ 2 వికెట్లు, క్రైగ్ ఓవర్టన్ 3 వికెట్లు తీసి భారత్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ తీశారు. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా ఆట చివరి సమయానికి 120 పరుగులు చేసి 42 పరుగుల ఆధిక్యంలో నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular