fbpx
HomeNationalటీ20 చరిత్రలో డబుల్ సెంచరీ నమోదు

టీ20 చరిత్రలో డబుల్ సెంచరీ నమోదు

FIRST-T20-DOUBLE-CENTURY-RECORDED

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వన్డే మరియు టెస్ట్ మ్యాచ్చుల్లోనే డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా టీ 20 క్రికెట్‌ చరిత్రలో ఇప్పుడు తొలి డబుల్ సెంచరీ నమోదయ్యింది. కేవలం 79 బంతుల్లో 205 పరుగులు చేసి ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి ఈ సరి కొత్త రికార్డును సృష్టించాడు.

ఇప్పటి వరకు 20 ఓవర్ల ఫార్మాట్‌లో అధిక పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. భారత రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగిన ఒక క్లబ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగిన సుబోధ్ భాటి, ప్రత్యర్థి సింబా జట్టుపై ఈ ఘనతను సాధించాడు. ఓపెనర్‌ గా వచ్చిన సుబోధ్ చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు,17 సిక్సర్లు ఉండడం గమనార్హం.

మొదటి 100 పరుగులను ఈ రంజీ ఆటగాడు కేవలం 17 బంతుల్లో సాధించడం ఇక్కడ విశేషం. ఢిల్లీ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 256 పరుగులు చేసింది. సుబోధ్ భాటితో పాటు సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి ఆరు పరుగులు చేశాడు. సుబోధ్ కంటే ముందు టీ 20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు స్కోర్‌ సాధించిన వారిలో ఈ రికార్డు క్రిస్‌గేల్‌ పేరున ఉంది.

యునివర్సల్‌ బాస్‌ 2013 ఐపిఎల్‌లో పూణే పై 66 బంతుల్లో 175 సాధించాడు. ఆ తరువాత ట్రై-సిరీస్‌లో జింబాబ్వేపై ఆరోన్‌ ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేసి గేల్ తరువాతి స్థానంలో నిలిచాడు. ఇక సుబోధ్ భాటి కెరీర్‌ విషయానికొస్తే 24 లిస్ట్-ఎ, 39 టీ 20 మ్యాచ్‌ల్లో ఢిల్లీకు ప్రాతినిధ్యం వహించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular