fbpx
Saturday, April 27, 2024
HomeSportsముంబై పై ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్!

ముంబై పై ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్!

DELHI-BEAT-MUMBAI-INDIANS-WITH-4WICKETS

ముంబై: ఐపీఎల్‌ 2022లో జరిగిన రెండవ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ముంబైపై భోణీ చేసింది. ముంబై తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ సేన ముంబైపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ 2021 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

ముంబై నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒకానొక దశలో కేవలం 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితిలో ఢిల్లీ ఆల్‌రౌండర్లు లలిత్‌ యాదవ్‌( 38 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌(17 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు చేసి ఆఖర్లో ​మెరుపులు మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు.

కాగా ముంబై ఇండియన్స్ టీం ఐపీఎల్ 2012 సీజన్ నుండి తాము ఆడిన ప్రతి తొలి మ్యాచ్‌లో ఓడిపోతూ వస్తోంది. తాజాగా మరోసారి ఓటమిని మూటగట్టుకొని తమ చెత్త రికార్డును కొనసాగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular