fbpx
HomeInternationalకొత్త ఐసిసి మార్గదర్శకాలతో ఆటగాళ్ళు ఎలా వ్యవహరిస్తారో చూడాలి: సంగక్కర

కొత్త ఐసిసి మార్గదర్శకాలతో ఆటగాళ్ళు ఎలా వ్యవహరిస్తారో చూడాలి: సంగక్కర

ముంబయి: క్రికెట్ ఒక సామాజిక ఆట అని, కోవిడ్-19 విరామం తర్వాత క్రికెట్ పున:ప్రారంభించినప్పుడు ఆటగాళ్ళు కొత్త ఐసిసి మార్గదర్శకాలను ఎలా ఎదుర్కుంటారో చూడటానికి ఆసక్తికరంగా ఉంటుందని శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర అన్నారు. ఆరోగ్య సంక్షోభం కారణంగా ప్రభుత్వ ఆంక్షలతో, మార్చిలో మూసివేయబడిన క్రీడను సురక్షితంగా తిరిగి ప్రారంభించడానికి ఐసిసి మార్గదర్శకాలతో ముందుకు వచ్చింది. మైదానంలో మరియు వెలుపల సామాజిక దూరం నిబంధనలను పాటించడం, సురక్షితమైన బంతి నిర్వహణ, చేయదగినవి మరియు చేయకూడనివి, ఇలా గత నెల చివర్లో ఐసిసి తాయారు చేసిన మార్గదర్శకాల్లో పేర్కొనబడ్డాయి.

బంతిని మెరిపించడానికి లాలాజల ఉపయోగంపై నిషేధం విధించాలని ఐసిసి క్రికెట్ కమిటీ సిఫారసు చేసింది. ఫాస్ట్ బౌలర్లు లేదా స్పిన్నర్లకు బంతి మెరుస్తూ ఉండటం ఒక సహజమైన విషయం అని మేరీలేబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) అధ్యక్షుడు సంగక్కర, స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్ట్ షోలో అన్నారు.

క్రికెట్ ఒక సామాజిక ఆట, డ్రెస్సింగ్ రూమ్‌లో ఎక్కువ సమయం గడపటం, మాట్లాడుకోటం కబుర్లు చెప్పుకోడం ఇక పై ఉండవు. వార్మప్‌లు లేవు, ఆడటానికి సిద్ధపడి రావటం, ఆడటం వెళ్ళిపోవటం గా మారిపోతుంది. కాబట్టి, ఆటగాళ్ళు ఎలా వ్యవహరిస్తారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది అని అన్నారు.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మరియు శ్రీలంకతో సహా పలు అగ్ర జట్ల క్రికెటర్లు ఇప్పటికే కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ కింద బహిరంగ శిక్షణను ప్రారంభించారు. జూలై 8 నుండి వెస్టిండీస్‌తో స్వదేశంలో ప్రతిపాదిత మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లీష్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) షెడ్యూల్‌ను ప్రకటించింది, ఇది కరోనావైరస్ విరామం తర్వాత జరిగే మొదటి సిరీస్‌ కావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular