fbpx
Saturday, April 27, 2024
HomeBig Storyభారత్ లో 2 వ్యాక్సిన్లకు డీజీసీఐ అత్యవసర ఆమోదం

భారత్ లో 2 వ్యాక్సిన్లకు డీజీసీఐ అత్యవసర ఆమోదం

DGCI-APPROVED-COVISHIELD-COVAXIN

ఢిల్లీ : యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్‌కు డీసీజీఐ ఆదివారం శుభవార్త అందించింది. కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోద ముద్ర వేసింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా, కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి సమ్యుక్తంగా అభివృద్ధి చేశాయి.

ఈ నేపథ్యంలో డీసీజీఐ డైరెక్టర్‌ విజి సోమాని మాట్లాడుతూ, కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ అన్ని అంశాలు పరిశీలించాకే రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు.

డిసీజీఐ అనుమతి ఇవ్వడంతో మరో వారం రోజుల్లోనే భారత్‌లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డీజీసీఐ ప్రకటనపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ అభివృద్దికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular