fbpx
HomeBusinessబ్యాంకులకు రాబోవు రోజుల్లో కష్ట కాలాలు

బ్యాంకులకు రాబోవు రోజుల్లో కష్ట కాలాలు

BANKS-MAY-FACE-MAINTENANCE-PROBLEMS-FITCH

న్యూఢిల్లీ: భారత దేశంలోని బ్యాంకులు రాబోయి కాలంలో క్లిష్టమైన నిర్వహణ వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, రుణ ఆస్తులపై ఒత్తిళ్లు, రుణ మాఫీలు పెరగడం వంటి వాటిని ఫిచ్ ప్రస్తావించింది.

ద్రవ్యపరమైన సహకారానికి పరిమిత అవకాశాలే ఉన్నట్టు అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం, కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నందున సాధారణ కార్యకలాపాలపై ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. రుణ నష్టాలు పరిమితంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ‘‘కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా సమస్యాత్మక రుణాలను ఒక్కసారి పునర్‌నిర్మాణానికి ఆర్‌బీఐ బ్యాంకులకు అనుమతించింది.

దీంతో మొండి బకాయిల గుర్తింపు (ఎన్‌పీఏలు), వాటికి కేటాయింపుల పరంగా బ్యాంకులకు ఉపశమనం లభించింది. అయితే, ఇలా పునరుద్ధరించిన రుణాలు భవిష్యత్తులో సరిగ్గా వసూలు కాకపోతే బ్యాంకులపై అధిక ఎన్‌పీఏల భారం పడుతుంది’’ అంటూ ఫిచ్‌ తన నివేదికలో వివరించింది. ఆర్‌బీఐ డేటాను పరిశీలిస్తే, 2013–14 నుంచి 2018–19 మధ్య భారత బ్యాంకులు 85 బిలియన్‌ డాలర్ల (రూ.6లక్షల కోట్లకు పైగా) రుణాలను మాఫీ చేసినట్టు తెలుస్తోందని, ఇందులో 80 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నాయని తెలిపింది.

‘‘ఈ సారి ఆర్థిక సమస్యలు మరింత విస్తృతంగా, లోతుగా ఉండనున్నాయి. కనుక రుణాల పునర్నిర్మాణం అనేది పెద్ద సవాలే. నిర్వహణ సమస్యలు ఎక్కువ’’ అని ఫిచ్‌ పేర్కొంది. 2022 సంవత్సరం తొలి త్రైమాసికం వరకు భారత జీడీపీ కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకోకపోవచ్చని ఫిచ్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో జీడీపీ మైనస్‌ 10.5 శాతానికి క్షీణించి, 2021–22లో 11 శాతానికి పుంజుకోవచ్చని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular