fbpx
HomeNationalఏఐసీసీ‌ చీఫ్‌గా మళ్ళీ కొనసాగనున్న సోనియా?

ఏఐసీసీ‌ చీఫ్‌గా మళ్ళీ కొనసాగనున్న సోనియా?

SONIA-CONTINUES-AS-PARTY-CHIEF

ఢిల్లీ : కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని ఆ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అద్యక్షురాలిగా కొనసాగకూడదని నిర్ణయించి లేఖను సమర్పించి అది సభలో చదివి అందరి ఆమోదం అయ్యాక మళ్ళీ కథలో మార్పు వచ్చింది. సోమవారం దాదపు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీనే పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగాలని సీనియర్‌ నేతలు మన్మోహన్‌ సింగ్‌, ఏకే ఆంటోనీలు కోరారు.

నేషనల్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని 23 మంది పార్టీ సీనియర్‌ నేతలు సోనియాకి లేఖ రాసిన నేపథ్యంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం చాలా వేడిగా సాగింది. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరికొన్ని నెలల పాటు కొనసాగుతారని సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజే సత్వర నిర్ణయం వెలువడుతుందని ఆశించరాదని, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు, ఎంపికకు సమయం పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశాయి.

పార్టీ నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసేంత వరకూ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని సోనియాను తాము కోరామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇంకొన్ని నెలలపాటు పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఆమె కొనసాగుతారని పేర్కొన్నాయి. ఆరు నెలల్లో తదుపరి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని తెలిపాయి. ఇక అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్‌ నేతల తీరుపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది.

నాయకత్వ మార్పుపై బీజేపీ ప్రోద్బలంతోనే సీనియర్లు లేఖ రాశారన్న రాహుల్‌ వ్యాఖ్యలపై కపిల్‌ సిబల్‌, ఆజాద్‌ వంటి సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్‌ నేతలను అనునయించేందుకు స్వయంగా రాహుల్‌ వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular