fbpx
HomeAndhra Pradeshపీపీఈ కిట్లతో వివాహ వేడుక

పీపీఈ కిట్లతో వివాహ వేడుక

CATERING-WITH-PPE-KITS

విజయవాడ: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ సంధర్భంలో వివాహ, ఇతర శుభకార్యాలను జరపకపోవడం చాల మంచిదని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఒక వేళ నిర్వహించాలన్నా అతి తక్కువ మందితో నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే.

ఇటివల కృష్ణా జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో క్యాటరింగ్‌ సిబ్బంది వినూత్నంగా భోజనాలు వడ్డించారు. కరోనా వైరస్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వివాహానికి వచ్చిన బంధువులు, అతిధులకు క్యాటరింగ్‌ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి భోజనాలు వడ్డించారు. భౌతిక దూరం పాటిస్తూ క్యాటరింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ పెళ్ళి వేడుక కృష్ణా జిల్లాలోని ముదినేపల్లిలో జరిగింది. గుడివాడకు చెందిన కోటి క్యాటర్స్‌ కంపెనీ కరోనా కాలంలో ఇలా ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణమాసం ప్రారంభం కావటంతో పరిమిత సంఖ్యలో పలు శుభకార్యాలు జరుగుతున్నాయి.

ఈ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పీపీఈ కిట్లు ధరించి వివాహ కార్యక్రమాల్లో భోజనం అందిస్తున్నామని కోటి క్యాటర్స్‌ నిర్వాహకులు తెలిపారు. ఇక రాష్ట్రంలో వివాహం, పలు శుభకార్యాలు జరుపాలి అనుకుంటే స్థానిక తహశీల్దార్ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular