fbpx
HomeNationalనానావతి ఆసుపత్రికి ఐశ్వర్యరాయ్ తరలింపు

నానావతి ఆసుపత్రికి ఐశ్వర్యరాయ్ తరలింపు

AISHWARYA-BACHAN-ADMITTED-IN-HOSPITAL

న్యూ ఢిల్లీ: కోవిడ్ -19 చికిత్స కోసం నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించినట్లు వార్తా సంస్థ ఆణీ నివేదించింది. 46 ఏళ్ల నటికి కొన్ని రోజుల క్రితం పాజిటివ్ అని తేలింది, అయితే తనను హోం ఐసోలేషన్ లో ఉంచారు.

ఐశ్వర్య రాయ్ మామ అయిన అమితాబ్ బచ్చన్, భర్త అభిషేక్ కూడా నానవతి ఆసుపత్రిలో ఉన్నారు. వారు గత వారికి పాజిటివ్ ఎని తేలడంతో ఆసుపత్రికి తరలించారు. ఐశ్వర్య, అభిషేక్ ఎనిమిదేళ్ల కుమార్తె ఆరాధ్య కూడా కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. అమితాబ్ బచ్చన్ భార్య అయిన జయ బచ్చన్ కు నెగటివ్ వచ్చింది.

గత వారంలో, అభిషేక్ బచ్చన్ తన భార్య మరియు కుమార్తె ఇద్దరికి కరోనా వైరస్ కోసం పాజిటివ్ గా తేలిందని అయితే వారు హోం ఐసోలేషన్ లోనె ఉంటరు అని ట్వీట్‌లో ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండడం వలన ఐశ్వర్యరాయ్ ను కూడా నానావతి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular