fbpx
Sunday, April 28, 2024
HomeNationalఐదు రాష్ట్రాల ఎన్నికల పై స్పందించిన రాహుల్ గాంధీ!

ఐదు రాష్ట్రాల ఎన్నికల పై స్పందించిన రాహుల్ గాంధీ!

RAHUL-RESPONDS-ON-ASSEMBLY-ELECTIONS-RESULTS

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కాగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన రాహుల్‌ గాంధీ తన స్పందన తెలియజేశారు. ఆయన ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి ఆయన శుభాకాంక్షలను తెలిపారు. తమ పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు మరియు వాలంటీర్ల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని, దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తామని తెలిపారు.

ఇదిలా ఉండగా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమి పాలయింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి గోవా వరకు ఒక్క రాష్ట్రంలోనూ గెలుపుసు సొంతం చేసుకోలేదు. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవ‌డంతో పాటు యూపీలో కేవ‌లం ఒక స్ధానంలోనే కాంగ్రెస్ ఆధిక్య‌తలో కొన‌సాగడం పార్టీ శ్రేణులను కలవరపరిచింది. అంతేగాక పంజాబ్‌లో సీఎం చన్నీ, పీసీసీ చీఫ్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular