బెలారస్: బెలారస్లో ఉక్రెయిన్ మరియు రష్యాలకు సంబంధించిన బృందాల మధ్య జరుగుతున్న చర్చలు కాసేపటి క్రితమే ముగిశాయి. ఈ చర్చలు దాదాపు 4 గంటల పాటు ఇరు ప్రతినిధుల మధ్య జరిగాయి. కాగా ఈ చర్చలకు ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు హాజరయ్యారు.
అయితే, రష్యా యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేయగా, రష్యా మాత్రం ఉక్రెయిన్ నాటోలో చేరమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టుబట్టినట్టు సమాచారం. ఇలా ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైనట్టు సమాచారం.
ఉక్రెయిన్-రష్యా ల మధ్య సంక్షోభం అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ను కూడా తాకింది. రష్యా అధ్యక్షుడు పుతిన్కు వ్యతిరేకంగా, ఉక్రెయిన్కు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకుని ఉక్రేనియన్లు వైట్ హౌస్ దగ్గర నిరసనలు చేపట్టారు. తమ స్వదేశానికి మద్దతుగా వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ముందు ఉక్రెయిన్లు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఉక్రెయిన్లో పుట్టి రష్యాలో పెరిగిన ఓ వ్యక్తి కూడా పాల్గొనడం విశేషం.