fbpx
Sunday, April 28, 2024
HomeNationalసీఎంలు, మంత్రులు విద్యుత్ వాహనాలనే వాడాలన్న కేంద్రం!

సీఎంలు, మంత్రులు విద్యుత్ వాహనాలనే వాడాలన్న కేంద్రం!

CHIEFMINISTERS-USE-ELECTRIC-VEHICLES-SAYS-CENTRAL-MINISTER

న్యూఢిల్లీ: ప్రభుత్వ పనులపై ఎల్లప్పుడూ వివిధ పర్యటనల్లో తిరిగే రాష్ట్ర ముఖ్యమంత్రులు మరియు మంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సూచన చేసింది. ప్రభుత్వ విధివిధానాలకు అనుగుంఅంగా మంత్రులు మరియు ముఖ్యమంత్రులు విద్యుత్తు వాహనాలనే వినియోగించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ రాష్ట్రాలకు ఒక‌ లేఖ రాశారు.

కేంద్ర ప్రభుత‍్వం గత కొద్ది కాలంగా విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచాలని కోరుతోంది. దానికి తగ్గట్టుగానే విద్యుత్ వాహనాల అమ్మకాలను పెంచడానికి ఫేమ్‌ పేరుతో ప్రత్యేకంగా ప్రోత్సహకాలను అందజేస్తోంది. దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు కూడా ఎల‌క్ట్రిక్ వాహనాలు(ఈవీ)లను ఉపయోగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రతినిధులకు లేఖ రాశారు.

లేఖ సారాంశం ప్రకారం మంత్రి ఇలా అన్నారు: ప్రస్తుతం ప్రభుత్వ అవసరాల మేరకు మీరు వినియోగిస్తున్న డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను వాడాలని మినిస్టర్స్‌, చీఫ్‌ మినిస్టర్స్‌ని కోరుతున్నాను అని అన్నారు. అలాగే ఆయా శాఖల వారీగా ఉపయోగిస్తున్న పెట్రోలు, డీజిల్‌ వాహనాలను సైతం ఈవీలగా మార్చాలని కోరారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఈవీలనే వాడాలని సూచించింది.

ముఖ్యమంత్రులు వెంట వెళ్ళే కాన్వాయ్‌లో దాదాపుగా పదికి పైన వాహనాలు వినియోగంలో ఉంటాయి. ఇక మంత్రుల కాన్వాయ్‌లో ఐదు వరకు వాహనాలు ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ విద్యుత్ వాహనాలుగా మార్చితే మంచి ప్రచారం జరగడంతో పాటు కాలుష్యాన్ని కూడా కొంత మేరకు కట్టడి చేసినట్టు అవుతుంది అని ఇది ప్రజలకు కూడా ఆదర్శప్రాయంగా ఉంటుందని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular