ఈయూ: ఈయూ యొక్క జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ను అతిక్రమిస్తూ వినియోగదార్ల యొక్క వ్యక్తిగత డేటాను సేకరించిన అభియోగంపై అమెజాన్ పై యూరోపియన్ యూనియన్ 886.6 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ.6,593 కోట్లు జరిమానా విధించినట్లు ఈ కామర్స్ దిగ్గజం ప్రకటించింది.
లగ్జెమ్బర్గ్ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ డేటా ప్రొటెక్షన్ అమెజాన్ కంపెనీ యూరోప్ కోర్ పై జూలై 16న ఈ మేరకు జరిమానా విధించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. “అర్హత లేకుండా సీఎన్ పీడీ నిర్ణయం ఉందని మేము నమ్ముతున్నాము, ఈ విషయంలో మమ్మల్ని మేము రక్షించుకోవాలని భావిస్తున్నాము” అని అమెజాన్ తన ఫైలింగ్ లో వివరణ ఇచ్చింది.
యూరోపియన్ జీడీపీఆర్ కంపెనీలు తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించడానికి అమేజాన్ ప్రజల సమ్మతిని మూందుగా కోరాలి, అలా సమ్మతి తీసుకోకపోతే ఆ దేశ చట్టాల ప్రకారం తీవ్రమైన జరిమానాలను ఏ కంపెనీ అయినా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గతంలో అమెజాన్ కంపెనీ 300 మిలియన్ డాలర్ల అంటే యూరోపియన్ కరెన్సీ ప్రకారం 250 మిలియన్ యూరోల మొత్తం పన్నులు చెల్లించాలంటూ యూరోపియన్ కమీషన్ జారీ చేసిన ఆదేశాలను స్థానిక కోర్టు రద్దు చేసింది. అయితే లగ్జెమ్బర్గ్ ప్రభుత్వంతో అమెజాన్ కుదుర్చుకున్న పన్ను ఒప్పందానికి సంబంధించి 2017లో యూరోపియన్ యూనియన్(ఈయూ) ఎగ్జిక్యూటివ్ బెంచ్ పన్ను ఆదేశాలను జారీ చేసింది.