fbpx
HomeTelanganaతెలంగాణ ఉద్యోగులపై కేసీఆర్‌ వరాల జల్లు

తెలంగాణ ఉద్యోగులపై కేసీఆర్‌ వరాల జల్లు

30%-FITMENT-TO-TELANGANA-EMPLOYEES-ANNOUNCED-BY-KCR

హైదరాబాద్‌: పే రివిజన్ కమీషన్ పై ఆశలు పెట్టుకుని ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ తీపి కబురు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేదికగా ఉద్యోగులకు 30శాతం పీఆర్సీని ఇస్తున్నట్లు ప్రకటించారు. 2021 ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.

అదే విధంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, కరోనాతో వేతన సవరణలో ఆలస్యం జరిగింది. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలతో స్వయంగా నేను కూడా చర్చించాను. 2014లో 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాం. ఈ సారి 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంచుతాం. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తాం, అని కూడా కేసీఆర్‌ పేర్కొన్నారు.

రెగులర్ ఉద్యోగులతో పాటు రాష్ట్రంలోని హోంగార్డులు, వీఏవో, వీఆర్‌ఏ, ఆశావర్కర్లకు, అంగన్‌వాడీ, విద్యా వాలంటీర్లు, సెర్ప్‌ సిబ్బందికి కూడా ఈ పీఆర్సీ వర్తింప చేస్తాం. అలానే పెన్షనర్ల వయోపరిమితి 75 నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తాం. అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తాం. దంపతులైన ఉద్యోగులకు అంతర్‌జిల్లా బదిలీలకు ఆమోదం తెలుపుతున్నాం. మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేస్తాం అని కేసీఆర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular