fbpx
Saturday, July 27, 2024
HomeBig Storyప్రపంచానికి మంచి చేయడమే క్వాడ్‌ లక్ష్యం: ప్రధాని మోదీ

ప్రపంచానికి మంచి చేయడమే క్వాడ్‌ లక్ష్యం: ప్రధాని మోదీ

QUAD-HELP-WORLD-PEACE-SAYS-PM-MODI

టోక్యో: జపాన్ లో జరుగుతున్న క్వాడ్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని అందిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. క్వాడ్‌ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు.

ఈ రోజి జపాన్ రాజధాని టోక్యో నగర వేదికగా క్వాడ్‌ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ నలుగురు ఈ సదస్సుకు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. క్వాడ్ తక్కువ వ్యవధిలోనే ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో-పసిఫిక్‌లో శాంతిని నిర్ధారించిందని పేర్కొన్నారు.

ఈ క్వాడ్ వల్ల కరోనా కష్టకాలంలో సభ్యదేశాల మధ్య వ్యాక్సిన్‌ పంపిణీ, క్లైమేట్‌ యాక్షన్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ తెలిపారు. అంతేకాదు, ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్‌ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular