fbpx
HomeAndhra Pradeshవిజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం

FIRE-ACCIDENT-VIJAYAWADA-COVID-CENTER

విజయవాడ: ఈ రోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కోవిడ్ సెంటర్ గా ఉపయోగిస్తున్న హోటల్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది కరోనావైరస్ రోగులు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లో 30 మంది కోవిడ్ రోగులు ఉన్నట్లు సమాచారం.

ఈ సెంటర్లో ప్రవేశించిన మంటలు రోగుల భయాందోళనలకు దారితీశాయి; ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను కాపాడటానికి భవనం నుండి దూకినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఒకరి బంధువు ఆ వ్యక్తిని రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుండి హోటల్ కి తరలించినట్లు చెప్పారు. అతను చీలమండ పగులుతో బాధపడ్డాడు.

హోటల్ నుండి ఇప్పటివరకు 20 మందిని రక్షించామని, మరికొందరు భవనం లోపల చిక్కుకుపోయారని అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. “ఈ సంఘటన తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. సుమారు 22 మంది రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేము మొత్తం భవనాన్ని ఖాళీ చేస్తున్నాము. ప్రాథమిక నివేదిక ప్రకారం అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తుంది, కాని ఇంకా దీనిని నిర్ధారించాల్సి ఉంటుంది, “అని కృష్ణ జిల్లా కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అన్నారు.

కోవిడ్ రోగుల కోసం హోటల్ స్వర్ణ ప్యాలెస్‌ను రమేష్ హాస్పిటల్ లీజుకు తీసుకునంది. “ఈ సంఘటనలో 15-20 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 2-3 మంది తీవ్రంగా ఉన్నారు” అని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల పరిహారం ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular