fbpx
HomeMovie Newsమే 7 న ఓటీటీ లో 'అర్ద శతాబ్దం'

మే 7 న ఓటీటీ లో ‘అర్ద శతాబ్దం’

Ardashatabdam willStream fromMay7th

టాలీవుడ్: ఓటీటీ లు కొద్దిగా పాపులర్ అయినప్పటినుండి ఓటీటీ ల కోసం ప్రత్యేక సినిమాలు రూపొందుతున్నాయి. అంతే కాకుండా కొన్ని చిన్న సినిమాలు థియేటర్లు దొరకకనో లేదా మరేదైనా కారణం చేతనో ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నాయి. కరోనా కారణంగా ఇదివరకు ‘కలర్ ఫోటో’ అనే సినిమా ఓటీటీ లో విడుదలైంది. ఇప్పుడు ‘అర్ద శతాబ్దం’ అనే మరో సినిమా ఓటీటీ లో విడుదలవనుంది. మే 7 నుండి ఈ సినిమా ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.

సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ఒక మంచి ఇంటెన్స్ డ్రామా గా ఆకట్టుకుంది. రిషిత శ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై వీర్ ధర్మిక్ సమర్పణలో చిట్టి కిరణ్ రామోజు , తేలు రాధా కృష్ణ ఈ సినిమాని నిర్మించారు. రవీంద్ర పుల్లే అనే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. కొంచెం పీరియాడిక్ కథ గా రూపొందిన ఈ సినిమా పేట్రియాటిక్ ఎలెమెంట్స్ తో ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ కూడా ఈ సినిమా పై ఆసక్తి ని పెంచగలిగాయి.

C /O కంచరపాలెం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ‘కార్తీక్ రత్నం‘ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కృష్ణ ప్రియా, నవీన్ చంద్ర, సుహాస్, శుభలేఖ సుధాకర్, సాయికుమార్ మరికొన్ని పాత్రల్లో నటిస్తున్నారు. థియేటర్లలో ఏప్రిల్ లో విడులవుతుందనుకున్న ఈ సినిమా ఇలా ఓటీటీ లో విడుదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular