fbpx
Sunday, April 28, 2024
HomeLife Styleకూరగాయలు హోం డెలివరీ!

కూరగాయలు హోం డెలివరీ!

VEGETABLES-HOME-DELIVERY-IN-HYDERABAD

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ఇల్లు దాటాలన్నా, మార్కెట్లకు వెళ్లి కూరగాయలు కొనాలన్నా జనం భయపడుతున్నారు. దీంతో ఇంటి ముందుకే సరుకు తెచ్చి విక్రయించే పాత ట్రెండ్‌ మళ్లీ ఆచరనలోకి వచ్చింది. వ్యాపారులు, రైతులు వినియోగదారుల ఇంటి ముంగిటే తాజా కూరగాయల్ని అందుబాటులో తెస్తున్నారు. ప్రయాణ భారం తగ్గడం, తాజా కూరగాయలు తక్కువ ధరకే దొరకడం, నాణ్యత దృష్ట్యా ఈ తరహా కొనుగోళ్లకు వినియోగదారుల నుంచి కూడా విశెష ఆదరణ లభిస్తోంది.

ప్రజలు రద్దీగా ఉండే మార్కెట్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కు వగా జరుగుతోంది. ఎటు నుంచి వస్తుందో, ఎవరి నుంచి వస్తుందో తెలియని దారుణ పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లో రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లను వికేంద్రీకరించారు. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ మార్కెట్లను పాత ప్రాంతాలకే తరలించారు. మొబైల్‌ వాహనాలను తగ్గించారు. దీంతో మార్కెట్లలో మరీ మునుపటి రద్దీ పెరిగింది. భౌతికదూరం సాధ్యంకాక, మాస్క్‌లు ధరించక మార్కెట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది.

దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్ర అవసరాలకు కావాల్సినంత కూరగాయలు దిగుమతి కాక ధరలు చాలా వరకు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వద్దకే కూరగాయల అమ్మకాల ప్రక్రియను వ్యాపారులు ప్రారంభించారు. హోల్‌సేల్‌ వ్యాపారులు రైతుల నుంచి కూరగాయలు సేకరించి వాటిని ఆటోలు, ట్రాలీల్లో కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంచి తొలుత విక్రయాలు జరిపారు. ధరలు తక్కువగా ఉండటం, రోజూ నిర్ణీత వేళల్లో విక్రయాలు జరపడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఈ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పుడు ఇలాంటి అమ్మకాలకు డిమాండ్‌ బాగ పెరగడంతో ప్రస్తుతం రైతులే నేరుగా విక్రయాల్లోకి దిగారు. తమ పంట ఉత్పత్తులను వారే సైకిళ్లు, ద్విచక్ర వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి విక్రయిస్తున్నారు. ఇలా రోజూ 20 – 30 కిలోల కూరగాయలను విక్రయిస్తున్నారు. దళారుల బెడద తప్పడం, తాము అనుకున్న ధరకే విక్రయాలు చేస్తుండటం వారికీ కలిసొస్తోంది. ఇది రైతులకు శుభ పరిణామం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular