fbpx
HomeLife Styleతన కస్టమర్లకు శుభవార్త చెప్పిన జియో!

తన కస్టమర్లకు శుభవార్త చెప్పిన జియో!

GOODNEWS-FOR-JIOFIBER-CUSTOMERS-CAMERA-ON-MOBILE-FEATURE-LAUNCHED

న్యూఢిల్లీ: భారత టెలికాం సంచలనం రిలయన్స్ జియో తమ వినియోగదార్లకు ఒక తీపికబురు చెప్పింది. ఇక పై జియో ఫైబర్‌ తమ వినియోగదారులు ఎటువంటి వెబ్‌కెమెరా లేకుండానే తమ టీవీలో వీడియో కాలింగ్‌ చేసే​ సాంకేతికతను జియో తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.

ఒక కొత్త ఫీచర్ ‘కెమెరా ఆన్ మొబైల్’‌తో వినియోగదార్లు తమ టీవీలలో వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ను పొందవచ్చు. దీనికోసం జియోజాయిన్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా ‘కెమెరా ఆన్ మొబైల్’ ఫీచర్‌ను జియో పరీక్షలు చేస్తోంది. కాగా ప్రస్తుతానికి ఈ సదుపాయం యాప్ రూపంలో‌ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

జియో యొక్క ఫైబర్‌ సేవలను వాడుకునే వారికి జియోఫైబర్‌వాయిస్‌తో వీడియోకాలింగ్‌ ఆప్షన్‌ను ఎనెబుల్‌ చేసుకోవచ్చు. కస్టమర్లు తమ మొబైల్‌లో ఇంస్టాల్ చేసుకున్న జియోజాయిన్‌ యాప్‌ ద్వారా ల్యాండ్‌లైన్‌ నంబర్లకు కూడా వాయిస్‌కాల్స్‌ చేసుకోవచ్చు.

కాగా వినియోగదార్లు తమ మొబైల్ ఫోన్ లోని కెమెరా ద్వారా తమ టీవీలో వీడియో కాల్ చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్‌ను జియోజాయిన్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలి. తద్వారా జియో ఫైబర్‌ నంబర్‌ను నమోదు చేశాకత, జియో జాయిన్‌ యాప్ సెట్టింగ్‌లలో ‘కెమెరా ఆన్ మొబైల్’ ఫీచర్‌తో వీడియోకాల్స్‌ చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular