fbpx
HomeBusinessకొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన కియా కంపెనీ!

కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన కియా కంపెనీ!

KIA-ELECTRIC-EV6-LAUNCHED-TODAY

సియోల్: కియా, దక్షిణ కొరియా దేశ రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఈ రోజు కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి విద్యుత్ కారును ఘనంగా ఆవిష్కరించింది. కంపెనీ ఈ విద్యుత్ కారుకు ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 సెడాన్ గా నామకరణం చేయగా, దీనిని కొరియాలో 40,800 డాలర్ల నుంచి 49,500 డాలర్ల ధరకు మార్కెట్లోకి తీసుకొచ్చింది.

కాగా తమ దేశీయ మార్కెట్లోకి కియా ఈవీ6 కోసం 30,000కు పైగా ముందస్తు ఆర్డర్లను, యూరప్ మరియు అమెరికా దేశాలతో కలిపి 8,800 ముందస్తు ఆర్డర్లను స్వీకరించినట్లు కియా తెలిపింది. ఈ సంవత్సరం ముగిసేలోపు తమ దేశంలో 3,000 యూనిట్లను, ఇతర దేశాల మార్కెట్లలో 17,000 యూనిట్ల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ పేర్కొంది.

ఈ వాహనాన్ని ఈ సంవత్సరం చివరినాటికి ప్రపంచం మొత్తం మీద అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో కంపెనీ ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ సబ్సిడీలతో కలిపి 34,761 డాలర్ల(అంటె భారత దేశం ప్రకారం రూ.25 లక్షల) కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

ఈవీ6 మోడల్ విద్యుత్ వాహనం రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో లభిస్తుంది. ఇది స్టాండర్డ్ 58 కిలోవాట్-అవర్ బ్యాటరీ ప్యాక్ గల కారును ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే వాహనం 370 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ 77.4-కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ గల కారును ఒకసారి ఫుల్ రిచార్జ్ చేస్తే 475 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

రాబోయే సంవత్సరంలో హ్యుండాయ్ ఐఓఐక్యూ 6, 2024లో అయోనిక్ 7 బిగ్ ఎస్ యూవీని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. ఇది బిఎమ్ డబ్ల్యు వంటి ప్రత్యర్థుల ఆల్ఫాన్యూమరిక్ పేర్లను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఇది 3.5 సేకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీనిని 5 నిమిషాలు చార్జ్ చేస్తే 100 కి. మీ దూరం వరకు ప్రయాణం చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular