fbpx
HomeBig Storyభారత ప్రధాని క్రిప్టోకరెన్సీలపై కీలక వ్యాఖ్యలు!

భారత ప్రధాని క్రిప్టోకరెన్సీలపై కీలక వ్యాఖ్యలు!

MODI-COMMENTS-ON-CRYPTOCURRENCY-IN-SYDNEY-DIALOGUE

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ భారీగా ఆదరణ పెరుగుతుంది. ఇలా క్రిప్టోకరెన్సీను బాగా ఆదరిస్తోన్న దేశాల్లో భారతదేశం‌ కూడా ముందు స్థానాల్లో ఉంది. కాగా దేశంలో దాదాపు 10 కోట్ల మంది పైగానే క్రిప్టోకరెన్సీ లపై పెట్టుబడులు‌ పెడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీపై సిడ్నీ డైలాగ్‌ వర్చువల్‌ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలను చేశారు.

ఈ సిడ్నీ డైలాగ్‌ వర్చువల్ కీనోట్ ప్రసంగంలో భాగంగా భారత దేశ ప్రధాని మోదీ మాట్లాడుతూ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే దాని ద్వారా చాల పెద్ద ప్రమాదమే పొంచి ఉందని అన్నారు. అలాగే యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కాగా ఈ క్రిప్టోకరెన్సీతో ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూసుకునే విషయంలో అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా విగ్నప్తి చేశారు. ఇటీవలే ప్రధాని మోదీ అధ్యక్షతన క్రిప్టోకు సంబంధించిన సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

ఈ సమావేశం‌ సందర్భంగా మోదీ తన ప్రసంగంలో ప్రపంచ పురోగతి, శ్రేయస్సు కోసం పలు కొత్త అవకాశాలపై దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుత సాంకేతికత ప్రపంచంలో పలు ప్రపంచ దేశాలకు ప్రధాన సాధనంగా మారిందని ఆయన అన్నారు. అటువంతి సాంకేతికతతోనే చాలా దేశాలకు ఇప్పటికే ప్రమాదం పొంచి ఉండే అవకాశం లేకపోలేదని కూడా ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular