fbpx
HomeMovie Newsసంపత్ నంది కథతో కొత్త సినిమా

సంపత్ నంది కథతో కొత్త సినిమా

VodelaRailwayStation MovieWith SampathNandiStory

టాలీవుడ్: టాలీవుడ్ లో దర్శకులు కొన్ని సినిమాలు తీసి స్థిరపడిన తర్వాత వాల్లు కథలు అందించి వాల్ల అసిస్టెంట్స్ తోనో , వేరే వాల్లతోనో సినిమాలు తియ్యడం సహజంగా జరుగుతూనే ఉంది. వాల్ల దగ్గర ఉన్న కథలు అన్నీ తియ్యడానికి సమయం కుదరకనో మారే కారణంగానో ఈ మధ్య చాలా మంది దర్శకులు ఈ పంథాను అనుసరిస్తున్నారు. కొందరు తమ కథలు అందించడం తో పాటు సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. సుకుమార్ ‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో కథలు అందించి తన శిష్యులతో డైరెక్షన్ చేయిస్తున్నారు. మధ్యలో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇపుడు సంపత్ నంది కూడా అదే బాటలో వెళ్తున్నారు.

సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే కొత్త సినిమా రాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఒక యదార్థ కథ ఆధారంగా రూపొందించబడుతుంది. శ్రీమతి లక్ష్మి రాధామోహన్ సమర్పణలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే. కే. రాధామోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ద్వారా అశోక్ తేజ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. కన్నడలో దాదాపు 25 సినిమాల్లో నటించిన వశిష్ఠ సింహ అనే నటుడు ఈ సినిమా ద్వారా తెలుగు వాళ్ళకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా హెబ్బా పటేల్ నటిస్తుంది. వీరితో పాటు పూజిత పొన్నాడ, సాయి రోనాక్, జబర్దస్త్ మహేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular