గన్నవరం: టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వేసిన బెయిల్ పిటిషన్పై సీఐడీ కోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించనుంది. మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తవగా, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
వంశీ తరఫు న్యాయవాదులు ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షతోనే పెట్టినదని వాదించారు. మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న వంశీకి చికిత్స అవసరమని పేర్కొన్నారు.
అటు సీఐడీ తరపున మాత్రం బెయిల్ మంజూరు చేస్తే వంశీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, విచారణపై దుష్ఫలితాలు ఏర్పడతాయని వాదనలు వినిపించారు. వంశీపై ఆందోళనకరమైన ఆరోపణలున్నాయని, విచారణ కోసం కస్టడీ అవసరమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్ లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. సీబీఐ కోర్టు తీర్పుపై తెలుగుదేశం శ్రేణులతో పాటు రాజకీయంగా ఆసక్తిగా చర్చలు నడుస్తున్నాయి. తీర్పు ప్రకారం ఈ కేసు దిశ మారే అవకాశముంది.