fbpx
Thursday, April 25, 2024
HomeMovie Newsమూడవ సినిమా మొదలుపెట్టిన వైష్ణవ్

మూడవ సినిమా మొదలుపెట్టిన వైష్ణవ్

VaishnavTej 3rdMovie Launch

టాలీవుడ్: మెగా కుటుంబం నుండి ఈ సంవత్సరం సినీ ప్రయాణం ప్రారంభించిన మరో హీరో ‘పంజా వైష్ణవ్ తేజ్’. ఫిబ్రవరి లో ‘ఉప్పెన’ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యాడు ఈ హీరో. ‘బుచ్చి బాబు’ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా పాండెమిక్ టైం లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాదించించి. ఒకే డెబ్యూ హీరోకి ఇది కొత్త రికార్డ్ గా నిలిచింది. ఈ సినిమా విడుదల అవకముందే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘కొండపాలెం’ అనే ఒక సినిమా పూర్తి చేసాడు వైష్ణవ తేజ్. ఈ సినిమా నుండి అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు ఇంటర్వూస్ లలో తెలిపారు.

ప్రస్తుతం వైష్ణవ తేజ్ హీరో గా రూపొందనున్న మూడవ సినిమా ఈ రోజు మొదలైంది. అర్జున్ రెడ్డి సినిమాని రూపొందించిన సందీప్ వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన గిరీశయ్య తమిళ్ లో అదే సినిమాని ‘ఆదిత్య వర్మ’ అనే పేరుతో రూపొందించి హిట్ సాధించాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నటించనున్న మూడవ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ‘రొమాంటిక్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించనున్నారు. ఉప్పెన ని మ్యూజికల్ హిట్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించనున్నారు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా గురించి మిగతా అప్ డేట్స్ రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular