మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి కొత్త సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిగా గుంటూరు కారం సినిమాతో వచ్చిన త్రివిక్రమ్, తన తదుపరి ప్రాజెక్ట్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాలని భావించాడు. కానీ బన్నీ ప్రస్తుతం అట్లీ చిత్రాన్ని మొదలుపెట్టిన నేపథ్యంలో, త్రివిక్రమ్కు కొంత గ్యాప్ ఏర్పడింది.
ఈ గ్యాప్లోనూ త్రివిక్రమ్ ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో విక్టరీ వెంకటేష్తో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు (రైటర్) బ్లాక్బస్టర్ హిట్స్ కావడంతో మళ్లీ ఈ కాంబోపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఎక్కువగా ఉంది.
తొలుత ప్లాన్ చేసిన త్రివిక్రమ్-వెంకీ సినిమా ఎందుకో ఆగిపోయినప్పటికీ, ఇప్పుడు మళ్లీ అదే ప్రాజెక్ట్ను రీ-విజిట్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడట. కథలో కొన్ని మార్పులు చేస్తూ కొత్తగా రూపుదిద్దనున్నట్టు తెలుస్తోంది.
వెంకటేష్ ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నారు. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మాత్రం ముందే మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందన్న అంచనాలు ఉన్నాయి. వెంకీ-త్రివిక్రమ్ సినిమా వస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్కు మరో మంచి ఎంటర్టైనర్ దక్కనుందని భావిస్తున్నారు.