హైదరాబాద్: చట్టం ముందు తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్ష పడాల్సిందే అనేది నిజమైంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే నిబంధనలు పాటించని వారిని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు చెందిన అధికారిక వాహనానికి చలాన్ విధించి తమకు అందరూ ఒక్కటే అని చాటి చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
ఈ ఆశ్చర్యకర సంఘటన బుధవారం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాగా హైదరాబాద్ టోలిచౌకి పీఎస్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లై ఓవర్పై ఓవర్ స్పీడ్ తో సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం (టీఎస్09ఎఫే0001) వెళ్తుండడాన్ని గుర్తించి చలానా విధించారు. మూడు వేల రూపాయల చలాన్ కట్టాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సీఎస్ కు ఆదేశించారు.