fbpx
Friday, June 2, 2023

INDIA COVID-19 Statistics

44,991,143
Confirmed Cases
Updated on June 2, 2023 6:18 pm
531,874
Deaths
Updated on June 2, 2023 6:18 pm
3,736
ACTIVE CASES
Updated on June 2, 2023 6:18 pm
44,455,533
Recovered
Updated on June 2, 2023 6:18 pm
HomeMovie Newsసుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించిన సెంట్రల్

సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించిన సెంట్రల్

SushantCase Takenby CentralBureauOfInvestigation

బాలీవుడ్: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్ పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మొదట ఆత్మ హత్య అనుకున్న విషయం కాస్త ఇపుడు హత్య, ఈ హత్య తో పాటు తన అసిస్టెంట్ కూడా హత్య అనే కోణం లో దర్యాప్తు జరుగుతుంది. సుశాంత్ తండ్రి కే కే సింగ్ బీహార్ లో కొత్త కేసు నమోదు చేసినప్పటి నుండి ఈ కేసు విషయంలో సంచలన నిజాలు బయట పడుతున్నాయి. ముంబై పోలీసులు సహకరించడం లేదనే విషయం కూడా గట్టిగానే వినపడుతుంది. ఈ విషయం పై ఈ కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని దేశవ్యాప్తంగా అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కేసును సీబీఐకి బదిలీ చేయాలని బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సుప్రీంకోర్ట్ కి తెలియజేయడం జరిగింది. కాగా ఇప్పటి వరకు సుశాంత్ ఆత్మహత్య కేసుపై ముంబై పోలీసులు మరియు పాట్నా పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు జరుపుతున్నారు. సుశాంత్ కేసు విచారణ నిమిత్తం ముంబై వెళ్లిన తమ సీనియర్ పోలీస్ అధికారిని బలవంతంగా హోం క్వారెంటైన్ లో పెట్టడంపై బీహార్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ సీఎంని కలిసి తన కొడుకు మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని. తన కొడుకు సుశాంత్ ఆత్మ హత్య చేసుకునేంత పిరికివాడు కాదని, సుశాంత్ మరణం కేసులో ముంబై పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని,ఈ కేసును సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వాలని కోరాడు. దీంతో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. బీహార్ ప్రభుత్వ సూచనలను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా ఈ కేసులో చానా అనుమానాలున్న సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంది. అలాగే తాను సుప్రీమ్ కోర్ట్ కి ఈ కేసుని పాట్నా నుండి ముంబై కి మార్చాలని పెట్టిన అభ్యర్థన కూడా సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular