fbpx
Thursday, April 25, 2024
HomeLife Styleపేటియం కేవైసీ పేరుతో లక్షల్లో మోసం

పేటియం కేవైసీ పేరుతో లక్షల్లో మోసం

PAYTM-KYC-FRAUDS-IN-HYDERABAD

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పోలీసులు పేటియం కేవైసీ అప్‌డేట్‌ పేరుతో ప్రజలను మోసాలకు గురి చేస్తున్న ఓ ముఠాను అరెస్ట్‌ చేశారు. నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ ముఠా అక్రమాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, పేటియం యాప్ అప్‌డేట్‌ పేరుతో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుంచి ఒక్క రూపాయి డిపాజిట్ చేయ్యాలని తొలుత కోరుతారు.

ఆ తరవాత ఖాతా వివరాలను సేకరించి, రిమోట్ యాక్సెస్‌తో లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. నగరంలోనూ ఇలాంటి ఫిర్యాదులు తమకు చాలా వరకు అందడంతో నిఘా వర్గాల ద్వారా విచారణ జరపగా, మోసం బయటపడినట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగరానికి చెందిన వినయ్ శర్మ అనే బాధితుడి నుంచి 4లక్షల 29 వేలు కాజేశారని తెలిపారు.

జార్ఖండ్‌లోని జంతార జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామని సజ్జనార్‌ వెల్లడించారు. జార్ఖండ్ చెందిన నంకు మండల్ అలియాస్ రాహుల్, రాజేష్ మండల్, శివశక్తి కుమార్ అలియాస్ అమిత్ బర్నల్, గౌరవ్ అరుణ్, దిల్ ఖుష్ కుమార్ సింగ్ లను అరెస్ట్ చేశామని తెలిపారు.

నిందితుల నుంచి 1లక్ష 47 వేల నగదు మొబైల్ ఫోన్లు డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడినవారంతా సైబర్ నేరాలు చెయ్యడంలో ఆరితేరినవారిన సీపీ పేర్కొన్నారు. పేటీఎం అప్‌డేట్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు వ్యక్తిగత వివరాలను అడిగితే ఎవరికీ ఇవ్వొద్దని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular