fbpx
Wednesday, April 24, 2024
HomeLife Styleపెట్రోలు ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి!

పెట్రోలు ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి!

NIRMALASITARAMAN-COMMENTS-ON-PETROL-PRICE

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు ధరలు సెంచరీ దాటి పరుగులు పెడుతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. తగ్గడం అనేది తెలియకుండా పెరుగుతున్న ధరల వల్ల పెట్రోల్ బంకులకు వెళ్లిన ప్రతిసారీ సామాన్యుడు బడ్జెట్‌ లెక్కలు వేసుకోవాల్సి పరిస్థితి నెలకొంది.

కాగా పెట్రోల్ ధరలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరొకసారి పాత పాట పాడారు. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి వస్తుందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 16న మీడియా సమావేశంలో తెలిపారు.

గత యూపీఏ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు, రూ.37,340 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించలేదని తెలిపారు. ఒక మీడియా సమావేశంలో తమిళనాడు తరహాలో కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి సీతారామన్ ఇలా సమాధానం ఇచ్చారు.

“మేము గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అన్నింటిని జాబితా చేస్తూ 2014లో ఒక తెల్ల కాగితాన్ని విడుదల చేసి ఉండాల్సింది. చమురు బాండ్లు దానిలో పెద్ద భాగం. గత యూపీఏ ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు చమురు బాండ్ల జారీ చేయడం వల్ల ఇంధన ధరలు తగ్గాయి. ఇప్పటికీ ఆ భారాన్ని ప్రజలు మోస్తున్నట్లు” అన్నారు.

ఇదిలా ఉండగా ఒక లీటరు పెట్రోల్ రేటుపై రూ.3 ఇంధన పన్నును తగ్గిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఈ ఆగస్టు 13వ తేదీన ప్రకటించింది. కాగా ఈ తగ్గింపు వల్ల రాష్ట్ర ఖజానా మీద ఏడాదికి రూ.1,160 కోట్ల భారం పడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular