fbpx
Thursday, April 25, 2024
HomeInternationalయూకే నుండి వచ్చే వారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు

యూకే నుండి వచ్చే వారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు

NEW-SOP-FOR-UK-RETURN-PASSENGERS

న్యూఢిల్లీ: భారత దేశంలో ఒక వైపు కరోనా కేసులు తగ్గుతుంటే, ఇప్పుడు మరోవైపు కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు కొత్త కరోనా కేసులు 29 నమోదయ్యాయి. భారత్‌లో కొత్త స్ట్రెయిన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే జనవరి 7 వరకు బ్రిటన్‌ నుంచి వచ్చే విమాన సర్వీసులపై భారత్‌ నిషేధం విధించింది. అయితే జనవరి 8 నుంచి తిరిగి విమాన సర్వీసులను నడిపేందుకు భారత్‌ సిద్ధమైనట్లు పౌర విమానయాన మంత్రి హర్దిప్‌పూరి శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించింది.

కొత్తగా ఇప్పుడు యూకే‌ నుంచి భారత్‌ వచ్చే ప్రయాణీకులందరికి కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేసింది. ఈ టెస్ట్‌లకు అయ్యే ఖర్చులు కూడా ఆ ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విమానయాన సంస్థలు ప్రయాణీకులను విమానంలోకి అనుమతించే ముందు కరోనా వైరస్ నెగటివ్ టెస్ట్ రిపోర్టును నిర్ధారించాలని, యూకే నుంచి వచ్చే ప్రయాణీకులందరూ భారత విమానాశ్రయాలకు చేరగానే తప్పనిసరిగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఎస్ఓపీలో పేర్కొంది.

టెస్ట్ లో నెగిటివ్‌ వచ్చినవారు 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జనవరి 30 వరకు అమల్లో ఉంటాయి. యూకే నుంచి వచ్చే వారందరూ 72 గంటల ముందు ఆన్‌లైన్‌ పోర్టల్‌ హ్త్త్ప్స్://వ్వ్వ్.నెవ్దెళీఇర్పొర్త్.ఇన్/ లో కోవిడ్ టెస్ట్‌లో నెగెటివ్‌గా రిపోర్టు సమర్పించాలి. ప్రయాణికుడిని విమానంలోకి ఎక్కడానికి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కోవిడ్ నెగిటివ్‌ రిపోర్ట్‌ను పరిశీలించాలి.

కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన.. అటూ ఇటూ మూడు వరసల్లో ఉన్న ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి. ఎయిర్‌పోర్ట్‌లో నెగెటివ్‌గా తేలిన వ్యక్తి అధికారుల పర్యవేక్షణలో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular